సింగరేణిలో విషాదం.. అడ్రియాల్‌ గనిలో చిక్కుకున్న ముగ్గురు మృతి

-

సింగరేణిలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది.పెద్దపల్లి జిల్లా గోదావరిఖని అడ్రియాల లాంగ్ వాల్ ప్రాజెక్టు లో జరిగిన ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. బొగ్గు కుప్పల కింద చిక్కుకున్న ఏరియా సేఫ్టీ ఆఫీసర్ జయరాజ్ , అసిస్టెంట్ మేనేజర్ చైతన్య తేజ, కాంట్రాక్టు కార్మికుడు తోట శ్రీకాం త్ లు మృతి చెందినట్లు సమాచారం అందుతోంది.

దీంతో ఈ ముగ్గురి మృతదేహాలను బయటకు తీసింది రెస్క్యూ బృందం. ఘటనా స్థలం నుంచి మృత దేహాలను అర్ధరాత్రి దాటిన తర్వాత గోదావరిఖని సింగరేణి హాస్పిటల్ కు తరలించారు అక్కడి సిబ్బంది. ప్రభుత్వ డాక్టర్లతో పోస్టుమార్టం నిర్వహించి ఆఫీసర్ జయరాజు, తేజ ల మృత దేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు అధికారులు. అయితే.. ఈ ఘోర ప్రమాదం నుండి సురక్షితంగా నలుగురు బయటపడ్డారు. వెంకటేష్, నరేష్, రవీందర్, వీరయ్య అనే కార్మికులు చాలా సురక్షితంగా బయట పడ్డారు. ఇక ఈ ప్రమాదంపై అధికారులు దర్యాప్తు చేపట్టనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news