తెలంగాణకు కేంద్రం శుభవార్త..రూ.రూ.2146.86 కోట్లు విడుదల

-

తెలంగాన రాష్ట్ర ప్రభుత్వానికి అదిరిపోయే శుభవార్త చెప్పింది కేంద్ర ప్రభుత్వం. తాజాగా రూ. .2,146 కోట్ల 86 లక్షలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం మంజూరు చేసింది. కరీంనగర్ – వరంగల్ 4 లేన్ విస్తరణ పనులు షురూ అయ్యాయి. ఈ నేపథ్యంలోనే.. రూ.2146.86 కోట్లను మంజూరు చేసింది కేంద్ర ప్రభుత్వం. ఈ మేరకు ట్వీట్ చేశారు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ.

దీంతో కరీంనగర్ – వరంగల్ జాతీయ రహదారి (ఎన్ హెచ్ 563) 4 లేన్ పనులకు మోక్షం లభించినట్లైంది. ఈ పనుల కోసం రూ.2,146 కోట్ల 86 లక్షలను కేంద్రం మంజూరు చేసియడంతో.. తెలంగాన రాష్ట్ర ప్రభుత్వానికి భారీ ఊరట లభించనుంది. కాగా.. గత కొన్ని రోజుల నుంచి.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం మధ్య వివాదం చెలరేగుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా కేంద్రం రాష్ట్రం హక్కులను కాలరాస్తుందని.. సీఎం కేసీఆర్ బహిరంగా చెబుతున్నారు. ఎన్నడూ లేని విధంగా.. కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news