గడ్చిరోలి బామ్రాగడ్‌ అడవుల్లో ముగ్గురు మావోయిస్టుల అరెస్టు

-

మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లా బామ్రాగడ్‌ అడవుల్లో ముగ్గురు మావోయుస్టులు కలకలం రేపింది. బామ్రాగడ్ అడవుల్లో మావోయిస్టులు సంచరిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు కూంబింగ్ నిర్వహించారు. ఈక్రమంలో ఎదురుపడిన ముగ్గురు మావోయిస్టులను అరెస్టు చేశారు.

బామ్రాగడ్ అడవుల్లో  సీ-60 ప్రత్యేక పోలీసు దళాలు కూంబింగ్‌ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో వేర్వేరు చోట్ల ఎదురుపడిన ముగ్గురు మావోయిస్టులను పట్టుకున్నారు. ఇందులో ఒక మహిళ ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

కోయర్ గ్రామానికి చెందిన రమేష్, పద్దూర్క్‌ వాసి తానీ అలియాస్ శశిలను అదుపులోకి తీసుకున్నామని పోలీసులు వివరించారు. వీరిద్దరిపై 4 లక్షల చొప్పున రివార్డు ఉందని వెల్లడించారు. జోరెవాడ అడవుల్లో అర్జున్ అలియాస్ మహేష్ చిక్కినట్లు పేర్కొన్నారు. వీరిపై వివిధ స్టేషన్లలో కేసులు నమోదైనట్లు వెల్లడించారు.

 

Read more RELATED
Recommended to you

Latest news