ఖమ్మంపై సభపై తుమ్మల సంచలన వ్యాఖ్యలు..18న చరిత్ర సృష్టించబోతున్నాం !

-

ఖమ్మంపై సభపై తుమ్మల సంచలన వ్యాఖ్యలు చేశారు. తాత్కాలిక ప్రయోజనాలు కోసం వేరే వ్యక్తులతోమీరు వెళితే అది మీ కర్మ అంటూ పార్టీ మారేవారిపై సెటైర్లు పేల్చారు. 18 వ తేదీన దేశ రాజకీయాల్లో పెను మార్పుకి ఖమ్మం వేదిక కానుంది..దేశంలో ఏ రాష్ట్రంలో అభివృద్ధి లేని విధంగా మన రాష్ట్రంలో ఉందన్నారు. దేశంలో ప్రాంతీయ పార్టీ గా ఉన్న తెలుగుదేశం జాతీయ పార్టీ గా ఏర్పడింది. అలానే ఇప్పుడు బీఆర్‌ఎస్‌ కూడా ఏర్పడబోతుందన్నారు.

దేశ రాజకీయాలను మలువు తిప్పే విధంగా పార్టీ అధ్యక్షుడు అడుగు వేస్తున్నాడు…ఢిల్లీ లో జరగాల్సిన సభను ఖమ్మం జిల్లాలో పెడుతున్నారంటే మన జిల్లాకు ఎంత ప్రాధాన్యత ఇచ్చారో మీరే తెలుసుకోవాలని తుమ్మల పేర్కొన్నారు. సీతారామ ప్రాజెక్ట్ పూర్తయైతే మీకు కావాల్సిన నీరు వస్తుంది. 10 లక్షలు ఎకరాలుకు నీరు అందిస్తున్నామన్నారు. మీసం మీద చెయ్యి వేసుకుని, కాలుమీద కాలు వేసుకునే విధంగా kcr మన రాష్ట్రంలో ప్రజలను నిలబెట్టారని కొనియాడారు తుమ్మల.

Read more RELATED
Recommended to you

Latest news