టైమ్స్ నౌ సర్వేలో ఆసక్తికర అంశాలు.. బీఆర్‌ఎస్‌కు 9.. వైసీపీకి 24

-

జాతీయ మీడియా సంస్థ టైమ్స్ నౌ లోక్ సభ ఎన్నికలపై సర్వే నిర్వహించింది. ఏపీ లోక్‌సభ ఎన్నికల్లో మరోసారి వైసీపీ విజయభేరిని మోగించడం ఖాయమని తాజాగా టైమ్స్‌ నౌ సర్వేలో తేలింది. వైసీపీ ఈ సారి 24 నుంచి 25 లోక్‌సభ స్థానాల్లో గెలిచి క్లీన్‌స్వీప్‌ చేయనుందని సర్వే స్పష్టం చేసింది. లోక్ సభ ఎన్నికలు జరిగితే తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి 9 నుంచి 11 స్థానాలు లభించే అవకాశం ఉందని వెల్లడించింది.

బీఆర్ఎస్ ఆవిర్భవ సభ ఉలిక్కిపడ్డ వైసీపీ | BRS Non-existent Meeting The Angry  YCP ,Brs, Telangana Cm, Kcr, BRS Party, Ysrcp, Ap Government, Machilipatnam  MLA, Perni Nani, - Telugu Ap, Brs, Perni Nani, Telangana

కాంగ్రెస్ 3 నుంచి 4 స్థానాలు, బీజేపీ 2 నుంచి 3 స్థానాలు, ఓ స్థానంలో ఇతరులు గెలిచే అవకాశాలున్నట్టు తెలిపింది. ఇక, ఏపీలో లోక్ సభ ఎన్నికలపైనా టైమ్స్ నౌ ఆసక్తికర అంశాలు పంచుకుంది. ఏపీలో వైసీపీ క్లీన్ స్వీప్ చేస్తుందని చెప్పింది. వైసీపీ 24 నుంచి 25 లోక్ సభ స్థానాలు చేజిక్కించుకుంటుందని పేర్కొంది. ఓట్ల శాతంలో కొద్దిగా తేడా ఉన్నప్పటికీ, అదేమీ వైసీపీ క్లీన్ స్వీప్ ను అడ్డుకోలేదని టౌమ్స్ నౌ సర్వే స్పష్టం చేసింది. ఒక్క స్థానంలో మాత్రం ఫలితం అటూ ఇటూగా ఉండే అవకాశాలున్నాయని, అక్కడ టీడీపీ అభ్యర్థి గెలవొచ్చని వివరించింది.

Read more RELATED
Recommended to you

Latest news