తిరుమల: గోగర్భం డ్యామ్ లోకి దూకబోయిన భక్తుడు…

-

తిరుమలలో శ్రీవేంకటేశుని దర్శించుకోవడానికి దేశదేశాల నుండి భక్తులు తండోపతండాలుగా తరలి వస్తుంటారు. కాగా ఇప్పుడు దర్శనానికి సమయం ఎక్కువగా తీసుకొంటోంది. అందుకే భక్తులు ప్రియ దర్శనం కోసం షెడ్ లలో రోజుల అపాటు ఎదురుచూడాల్సిన పరిస్థితి వస్తోంది. కాగా ఈ రోజు దర్శనం కోసం వచ్చిన నరేంద్ర అనే ఒక భక్తుడు ఆత్మహత్యకు ప్రయత్నించడం ఇప్పుడు సంచలనంగా మారింది. తిరుమలలో ఉన్న గోగర్భ పై డ్యామ్ నుండి దూకి చనిపోవడానికి ప్రయత్నించాడు. అయితే తెలుస్తున్న సమాచారం ప్రకారం నరేంద్రకు సిగరెట్ తాగే అలవాటు ఉండడం… రెండు రోజులుగా సీగరెట్ లేకపోవడం తో మనస్తాపము చెందిన నరేంద్ర ఆత్మహత్యకు ప్రయత్నించాడు.

కానీ టీటీడీ విజిలెన్సు స్టాఫ్ నరేంద్రను పట్టుకుని ఆయనకు తగిన కౌన్సిలింగ్ ను ఇచ్చి వారి కుటుంబ సభ్యులకు అప్పగించారట.

Read more RELATED
Recommended to you

Latest news