తిరుమల భక్తులకు శుభవార్త.. ఇవాళ్టి నుంచే టికెట్ల జారీ

-

తిరుమల శ్రీ వారి భక్తులకు తీపి కబురు చెప్పింది టీటీడీ పాలక మండలి. ఇవాళ ఉదయం 9 గంటలకు ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు విడుదల చేయనుంది టీటీడీ పాలక మండలి. నవంబర్, డిసెంబర్ నెలకు సంభందించిన రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనుంది టీటీడీ. రోజుకి 12 వేల చోప్పున టిక్కెట్లను విడుదల చేయనుంది.

23 వ తే ది శనివా రం సర్వదర్శనం టిక్కెట్లను ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది టీటీడీ పాలక మండలి. రోజుకి 10 వేల చోప్పున టిక్కెట్లను విడుదల చేయనున్న టీటీడీ… నవంబర్ నెలకు సంబంధించిన తిరుమలలో గదులు బుకింగ్ ఈనెల 25 వ తేది ఉదయం 9 గంటలకు అందుబాటులో వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనుంది. దీంతో టికె ట్ల కోసం ఎదురు చూస్తున్నారు భక్తులు. అంతేకాదు… దర్శనానికి వచ్చే భక్తులు కచ్చితం గా వ్యాక్సిన్‌ రెండు డోసులు, కరోనా నెగిటివ్‌ సర్టిఫికెట్‌ తీసుకుని రావాలని స్పష్టం చేసింది టీటీడీ.

Read more RELATED
Recommended to you

Latest news