ఈ వేసవికి తిరుమల వెళ్లాలనుకుంటున్నారా..? ఈ ప్యాకేజీ తో దర్శనం ఫ్రీ…!

-

ఈ వేసవికి తిరుమల వెళ్లాలని అనుకుంటున్నారా..? టికెట్ల కోసం ఆలోచిస్తున్నారా..? అయితే పక్కా మీరు ఈ ప్యాకేజీ ని చూడాల్సిందే. ఐఆర్‌సీటీసీ టూరిజం శ్రీవారి భక్తుల కోసం ప్రత్యేక టూర్ ప్యాకేజీ ని అందిస్తోంది. ఈ ప్యాకేజీ తో చక్కటి బెనిఫిట్స్ ని పొందవచ్చు. 2 రాత్రులు, 3 రోజుల టూర్ ప్యాకేజీ ఇది. ఇక దీని కోసం పూర్తి వివరాలని చూసేద్దాం.

ఈ ప్యాకేజీ లో మరో పలు ఏంటంటే శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం మీకు ఉచితంగా లభిస్తుంది. ఇక ఈ ప్యాకేజీ కి సంబంధించి పూర్తి వివరాలని ఇప్పుడు చూద్దాం. మొదటి రోజు హైదరాబాద్‌లో ఈ టూర్ ప్రారంభం అవుతుంది. సాయంత్రం 5.25 గంటలకు లింగంపల్లిలో ట్రైన్ స్టార్ట్ అవుతుంది. 6.10 గంటలకు సికింద్రాబాద్‌లో, రాత్రి 7.38 గంటలకు నల్గొండలో ట్రైన్ ఎక్కచ్చు. రెండో రోజు ఉదయం తిరుపతి చేరుకుంటారు.

శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం ఉంటుంది.స్పెషల్ ఎంట్రీ దర్శన్ ద్వారా శ్రీవారి దర్శనం చేసుకోవచ్చు. భోజనం అయ్యాక తిరుచానూర్‌లో పద్మావతి అమ్మవారిని చూడచ్చు. సాయంత్రం తిరుపతి రైల్వే స్టేషన్ దగ్గర డ్రాప్ చేస్తారు. సాయంత్రం 6.25 గంటలకు రైలు ఎక్కితే మూడో రోజు చేరుకుంటారు. ఇక ధర విషయానికి వస్తే.. స్టాండర్డ్ ప్యాకేజీ ట్రిపుల్, ట్విన్ షేరింగ్‌కు రూ.3,800, సింగిల్ షేరింగ్‌కు ధర రూ.4,940 చెల్లించాలి. కంఫర్ట్ ప్యాకేజీ ట్రిపుల్, ట్విన్ షేరింగ్‌కు రూ.5,660, సింగిల్ షేరింగ్‌కు రూ.6,790 చెల్లించాలి. పూర్తి వివరాలని వెబ్ సైట్ లో చూడచ్చు.

 

Read more RELATED
Recommended to you

Latest news