నేడు ఏపీలో కొత్తగా 4074 కరోనా పాజిటివ్ కేసులు..!

-

ఏపీలో కరోనా వైరస్ శర వేగంగా వ్యాపిస్తుంది. రోజు రోజుకు ఈ మహమ్మారి బారినపడే వారి సంఖ్యా పెరుగుతూనే ఉంది కానీ తగ్గడం లేదు. ఏపీలో కరోనా టెస్టులు భారీగా చేస్తున్నారు. టెస్టులు ఆ రేంజ్ లో చేస్తున్నారో అంతే స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. సోమవారం తాజగా రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్ ని విడుదల చేశారు. ఏపీలో మరోసారి రికార్డు బ్రేక్ చేసే స్థాయిలో కేసులు నమోదయ్యాయని అధికారులు వెల్లడించారు.

 

ap cases
ap cases

రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 35,580 మందికి పరీక్షలు చేయగా అందులో ఏకంగా 4,074 మందికి పాజిటివ్ వచ్చాయని వైద్యులు వెల్లడించారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కరోనా వైరస్ కేసుల సంఖ్య 53,724కు చేరిందన్నారు.అయితే రాష్ట్రములో గడచిన 24 గంటల్లో ఏకంగా 54 మంది చనిపోయారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 696కు చేరింది.

అయితే గడిచిన 24 గంటల్లో తూర్పు గోదావరి జిల్లాలో 09 మంది, శ్రీకాకుళంలో 5 మంది, కర్నూలులో ముగ్గురు, విశాఖపట్నంలో ఐదుగురు, కృష్ణాలో ఏడుగురు, ప్రకాశంలో నలుగురు, అనంతపురంలో ఆరుగురు, కడపలో ముగ్గురు, విజయనగరంలో ఒక్కరు, పశ్చిమ గోదావరి జిల్లాలో ముగ్గురు, గుంటూరులో తొమ్మిది, చిత్తూరులో ఐదుగురు, కడపలో ఒక్కరు మరణించారని సమాచారం.

ఇకపోతే గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో నమోదైన మొత్తం 53,724కు పాజిటివ్ కేసులకు గాను 21,664 మంది సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ అయ్యారని తెలియజేశారు. ఇకపోతే రాష్ట్రంలో 28,469 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని అధికారులు వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news