చంద్రబాబు ఆగ్రహం.. ‘దిశ’ చట్టానికి దిక్కు లేదు..!

-

జగన్ సర్కార్ దిశ చట్టం చేశామని కోట్ల ప్రజాధనంతో ప్రచారం చేసుకున్నారని.. కానీ అమలులో ఆ దిశ చట్టానికే దిక్కులేకుండా చేశారని చంద్రబాబు మండిపడ్డారు. వైసీపీ పాలనలో 14నెలల్లో 400పైగా అత్యాచారాలు, 16గ్యాంగ్ రేప్‌లు జరిగాయని ధ్వజమెత్తారు. రాజమండ్రిలో మైనర్ బాలికను గ్యాంగ్ రేప్ చేసి.. చివరకు నిందితులే పోలీస్ స్టేషన్ వద్ద విడిచిపెట్టారంటే నేరగాళ్లు ఏ స్థాయిలో పేట్రేగుతున్నారో అర్ధం చేసుకోవచ్చని అన్నారు.

రాజమండ్రిలో 16 ఏళ్ల మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్ జరిగింది. ఉద్యోగం ఇప్పిస్తానని ఆశ చూపించి ఆమెపై ఏడుగురు యువకులు దారుణానికి ఒడిగట్టారు. నాలుగు రోజుల పాటు బంధించి లైంగిక దాడికి పాల్పడ్డారు. అనంతరం వారే ఆ బాలికను పోలీస్ స్టేషన్ ఎదుట పడేసి వెళ్లిపోయారు. అయితే దిశ చట్టం గురించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా సీఎం జగన్ సర్కార్ ని నిలదీశారు.

Read more RELATED
Recommended to you

Latest news