నేడు కింగ్స్ పోరు.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న సీఎస్ కే

-

ఐపీఎల్ సీజన్ 2022లో జట్ల మధ్య ఆసక్తికర పోరు జరుగుతోంది. ఊహించని విధంగా ప్రత్యర్థి జట్లపై కొన్ని జట్లు విరుచుకుపడుతున్నాయి. అయితే నేడు ముంబాయి లోని వాంఖడే స్టేడియం వేదికగా కింగ్స్ తలపడుతున్నాయి. ఈ రోజు చెన్నై సూపర్ కింగ్స్ తో పంజాబ్ కింగ్స్ ఢీ కొట్టనుంది. అయితే ఈ సీజన్లో 70 మ్యాచ్ లు ఉండగా నేడు జరుగుతున్న మ్యాచ్ 38వది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన సీఎస్ కే బౌలింగ్ ఎంచుకుంది. ప్రస్తుత సీజన్‌లో ఇప్పటివరకు ఆడిన 7 మ్యాచ్‌ల్లో కేవలం రెండే విజయాలు నమోదు చేసి చెన్నై పాయింట్ల పట్టికలో చివరి నుంచి రెండో స్థానంలో ఉంది.

అలాగే 7 మ్యాచ్‌ల్లో 3 విజయాలతో 8వ స్థానంలో పంజాబ్‌ కింగ్స్‌ ఉంది. ఇదే సీజన్ లో ఇప్పటికే ఓ సారి చెన్నై, పంజాబ్ జట్లు పోటీ పడగా.. 54 పరుగుల తేడాతో పంజాబ్‌ కింగ్స్‌ విజయం సాధించింది. ఈ నేపథ్యంలో సీఎస్‌కే నేటి మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి పంజాబ్ పై ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తుంది. మరోవైపు ఈ మ్యాచ్‌లో గెలుపు ఇరు జట్లకు అత్యంత కీలకం కానుంది. ప్లేఆఫ్స్ ఆశలు సజీవంగా ఉంచుకోవాలనుకుంటే ఈ మ్యాచ్‌లో గెలుపు ఇరు జట్లకు చాలా అసవరం.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version