కేసీఆర్‌ అధ్యక్షతన నేడు టీఆర్‌ఎస్‌ శాసనసభ పక్ష విస్తృత స్థాయి సమావేశం

-

ఇవాళ ఉదయం 11.30 గంటలకు తెలంగాణ భవన్ లో టిఆర్ఎస్ పార్టీ శాసనసభ పక్ష విస్తృత స్థాయి సమావేశం జరుగనుంది. ముఖ్యమంత్రి, టిఆర్ఎస్ అధినేత కె. చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ఈ సమావేశం జరుగనుంది. అయితే.. ఈ సమావేశానికి హాజరు కావాలని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా అధ్యక్షులు, జడ్పీ చైర్మన్లు, డిసిసిబి, డిసిఎంఎస్ ల అధ్యక్షులు, రైతుబంధు సమితుల జిల్లా అధ్యక్షులకు పిలుపు వచ్చింది.

తెలంగాణ రాష్ట్రంలో యాసంగి వరి ధాన్యాన్ని కేంద్రప్రభుత్వం ఖచ్చితంగా కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా, ఆందోళన, నిరసన కార్యక్రమాలపై సమావేశంలో చర్చించి కార్యాచరణ ప్రకటన చేయనున్నారు సీఎం కేసీఆర్‌. ఇక ఈ సమావేశం తర్వాత కేసీఆర్ తో సహా మంత్రుల బృందం ఢిల్లీకి వెళ్లనుంది. తెలంగాణ రాష్ట్రంలో 100 శాతం వరి ధాన్యం కొనుగోలు చేయాలని కేంద్ర మంత్రులను, అవసరమైతే ప్రధానిని కలిసి డిమాండ్ చేయనుంది బృందం.

Read more RELATED
Recommended to you

Latest news