ఇవాళ సూపర్ స్టార్ కృష్ణ దశ దిన కర్మ..అభిమానుల కోసం మహేష్‌ కీలక నిర్ణయం

-

టాలీవుడ్ లో సూపర్ స్టార్ కృష్ణ మరణం ఇప్పటికి అభిమానులను, సినీ ప్రేక్షకులు సైతం.. కృష్ణ కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. మహేష్ కుటుంబంలో తన తల్లిదండ్రులతో పాటు తన అన్నయ్య కూడా మరణించడంతో మహేష్ బాబు తీవ్ర దిగ్భ్రాంతికి గురవుతూనే ఉన్నారు.

ఇది ఇలా ఉండగా, ఇవాళ సూపర్ స్టార్ కృష్ణ దశ దిన కర్మ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ మేరకు హైదరాబాద్ లోరెండు చోట్ల భారీగా ఏర్పాట్లు చేశారు కృష్ణ కుటుంబ సభ్యులు. సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖుల కు ఎన్ కన్వెన్షన్ లో భోజన ఏర్పాట్లు చేశారు. అలాగే, కృష్ణ మహేష్ అభిమానులకు జే ఆర్ సి కన్వెన్షన్ లో భోజన ఏర్పాట్లు చేశారు మహేష్‌ బాబు. ముఖ్యంగా అభిమానుల కోసం 5 వేల పాస్ లు పంపిణీ చేసి.. భోజనాలు పెడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news