కాంగ్రెస్‌ నేతల అరెస్టులకు నిరసనగా..నేడు కేసీఆర్‌ దిష్టిబొమ్మల దగ్ధం

-

ఓయూలో రాహుల్‌ గాంధీ సభ నిర్వహించేందుకు అనుమతి అడుగుతున్నా.. కాంగ్రెస్‌ కు అనుమతి ఇవ్వడం లేదు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఈ నేపథ్యంలోనే.. జగ్గారెడ్డి, ఎన్‌ఎస్‌యూఐ విద్యార్థులను అరెస్టు చేశారు. దీనిపై తెలంగాణ కాంగ్రెస్‌ అధ్యక్షులు రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. విద్యార్థి నాయకుల అరెస్టులకు నిరసనగా రేపు కేసీఆర్ దిష్టిబొమ్మల దగ్ధం చేయాలని పిలుపునిచ్చారు రేవంత్ రెడ్డి.

రాహుల్ గాంధీ ఉస్మానియా యూనివర్సిటీ పర్యటనకు అనుమతి ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించినందుకు nsui అధ్యక్షులు బలమూరి వెంకట్ తో పాటు 18 మంది nsui నాయకులను అరెస్ట్ చేసి నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి వేధించడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు.

వెంకట్ తో పాటు విద్యార్థి నాయకుల అరెస్టులు చేసి జైల్లో పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. అరెస్టులకు నిరసనగా రేపు సోమవారం నాడు రాష్ట్ర వ్యాప్తంగా nsui, యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో కేసీఆర్ దిష్టిబొమ్మలను దగ్ధం చేయాలని పేర్కొన్నారు రేవంత్ రెడ్డి. రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు, యువకులు కేసీఆర్ పాశవిక చర్యలను ఖండిస్తూ ఉద్యమించాలని పిలుపునిచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news