నేడు సిరిసిల్లలో మంత్రి కేటీఆర్ పర్యటన..కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహ ఆవిష్కరణ

-

నేడు సిరిసిల్లలో మంత్రి కేటీఆర్ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహ ఆవిష్కరణ చేయనున్నారు మంత్రి కేటీఆర్‌. ఇవాళ ఉదయం 11:30 గంటలకు ఎల్లమ్మ జంక్షన్ అభివృద్ధి & కొండా లక్ష్మణ్ బాపూజీ గారి కాంస్య విగ్రహ ఆవిష్కరణ చేయనున్నారు మంత్రి కేటీఆర్‌. అనంతరం పబ్లిక్ మీటింగ్ లో పాల్గొంటారు.

ఇక ఇవాళ మధ్యాహ్నం 1.30 గంటలకు వెంకంపేట మెయిన్ రోడ్డు విస్తరణ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు కేటీఆర్‌. మధ్యాహ్నం 2 గంటలకు జూనియర్ కాలేజ్ గ్రౌండ్ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. మధ్యాహ్నం 2:30 గంటలకు ముస్లిం గ్రేవ్ యార్డ్ అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం, మధ్యాహ్నం 3 గంటలకు ఆఖరి సఫర్ వెహికల్ ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 3:30 గంటలకు మోడల్ అంగన్వాడి కేంద్రం ప్రారంభోత్సవం, సాయంత్రం 4 గంటలకు సిరిసిల్ల పట్టణంలో బస్తీ దవఖాన ప్రారంభోత్సవం ఉండనుంది.

Read more RELATED
Recommended to you

Latest news