ఇంద్రకీలాద్రి ఆలయానికి పోటెత్తిన భక్తులు..!

-

శ్రావణ శుక్రవారం వరలక్ష్మీ వ్రతం సందర్భంగా ఇంద్రకీలాద్రి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఉదయం 5 గంటల నుండి భక్తులు ద‌ర్శ‌నం కోసం క్యూ లైన్ లో వేచి ఉన్నారు. శ్రావ‌ణ శుక్ర‌వారం సంధ‌ర్భంగా అమ్మ‌వారు వ‌రలక్ష్మీ దేవి గా భ‌క్తుల‌కు దర్శనం ఇస్తున్నారు. లక్ష్మీ దేవి గా దర్శనం ఇస్తున్న అమ్మవారిని దర్శించుకోవడం సంతోషంగా ఉంద‌ని భక్తులు చెబుతున్నారు. అమ్మవారి మూలవిరాట్ విగ్రహానికి వరలక్ష్మి దేవి అలంకరణ చేశారు.

శ్రావణమాసం మూడవ శుక్రవారం అమ్మవారి ఆలయంలో సామూహిక వరలక్ష్మీ వ్రతాలు జ‌రుపుతున్నారు. భ‌క్తుల ర‌ద్దీ ఎక్కువ‌గా ఉండే అవ‌కాశం ఉంద‌ని ముందుగానే గ్ర‌హించిన అధికారులు అన్నిర‌కాల ఏర్పాట్ల‌ను చేశారు. ఇక మ‌హిళ‌లు కృష్ణా న‌దిలో పుణ్య‌స్నానాలు ఆచ‌రించి అమ్మ‌వారికి పొంగ‌ళ్లు సమ‌ర్పిస్తున్నారు. ఇక తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ఆల‌యాల్లోను భ‌క్తుల ర‌ద్దీ ఎక్కువ‌గానే క‌నిపిస్తోంది. మ‌హిళ‌లు పెద్ద ఎత్తున ఉద‌యాన్నే ఆయ‌లాల‌కు చేరుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news