నేడు సిరిసిల్లకు రానున్న Y.S షర్మిల

-

నేడు సిరిసిల్లకు రానున్నారు Y.S షర్మిల. ఈ మేరకు వైఎస్ షర్మిల సిరిసిల్ల పర్యటన ఖరారు అయింది.  సిరిసిల్ల పట్టణం B.Y నగర్ లో నిరుద్యోగ యువకుడు చిటికెన నవీన్ ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే.

అయితే.. ఆ నిరుద్యోగ యువకుడు చిటికెన నవీన్ కుటుంబాన్ని పరామర్శించేందుకు వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల ఆదివారం ఉదయం 10:30 గంటలకు సిరిసిల్ల జిల్లా కేంద్రానికి రానున్నారని పార్టీ జిల్లా అధ్యక్షుడు తెలిపారు. కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని నవీన్ కుటుంబానికి అండగా నిలబడాలని ఆయన కోరారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news