టాలీవుడ్ మెడకు చుట్టుకుంటున్న డ్రగ్స్ కేసు.. వివరాలు కోరిన ఎన్సీబీ !

-

టాలీవుడ్ లో బాలీవుడ్ డ్రగ్స్ కేస్ ప్రకంపనలు సృష్టిస్తున్నది. ఎన్ సి బి వద్ద టాలీవుడ్ సెలెబ్రిటీల మత్తు భాగోతం ఉన్నట్టు తెలుస్తోంది. రకుల్, నమ్రత పేర్లు బయటికి రావడంతో టాలీవుడ్ సెలబ్రిటీల్లో అలజడి మొదలయింది. టాలీవుడ్ డ్రగ్స్ కేస్ వివరాలను ఎక్సైజ్ శాఖ నుండి ఎన్ సి బి తీసుకున్నట్టు సమాచారం. డ్రగ్స్ డీలర్ కెల్విన్ తో పాటు డ్రగ్స్ వాడిన సెలబ్రిటీ ల వివరాలు ఎన్ సి బీ కి ఎక్సైజ్ అధికారులు అందించినట్టు చెబుతున్నారు. ఎన్ సి బి విచారణ లో బాలీవుడ్ స్టార్స్ తో పాటు టాలీవుడ్ ప్రముఖుల పేర్లు కూడా ఉన్నట్టు తెలుస్తోంది.

ఎక్సైజ్ శాఖ ఛార్జ్ షీట్ లో పొంద పరిచిన వివరాలను ఎన్ సి బి పరిశీలిస్తున్నట్టు చెబుతున్నారు. టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసులో ఎక్సైజ్‌ శాఖపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎందుకంటే 12 మంది సినీ ప్రముఖుల బ్లడ్‌ శాంపిల్స్, వెంట్రుకలు, గోర్లు ఎఫ్‌ఎస్‌ఎల్‌లోనే ఉన్నాయని అంటోంది ఎక్సైజ్‌ శాఖ. మూడేళ్లుగా ఫోరెన్సిక్‌ సైన్స్ ల్యాబ్‌లోనే ప్రముఖుల శాంపిల్స్ ఉన్నట్టు చెప్పడం ఆసక్తికరంగా మారింది. నాలుగు కేసుల్లో 12 మందిని బాధితుల జాబితాలో చేర్చిన ఎక్సైజ్‌శాఖ, ఇప్పటి వరకు చార్జ్‌షీట్లు సిద్ధమైనా ఎఫ్‌ఎస్ఎల్ రిపోర్ట్ రాలేదని చెప్పి చార్జ్‌షీట్‌ దాఖలు చేయలేదు ఎక్సైజ్‌ శాఖ.

Read more RELATED
Recommended to you

Latest news