బిఆర్ఎస్ మీటింగ్ లో విషాదం.. తెగిపడ్డ కాళ్లు, చేతులు

-

భారత రాష్ట్ర సమితి పార్టీ ప్రతి డివిజన్, నియోజకవర్గాలలో ఆత్మీయ సమ్మేళనాల పేరిట కార్యక్రమాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బుధవారం ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం చీమలపాడు లో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో విషాదం చోటుచేసుకుంది. ఆత్మీయ సమ్మేళనం కోసం ఎంపీ నామ నాగేశ్వరరావు, ఎమ్మెల్యే రాములు వస్తుండడంతో కార్యకర్తలు బాణాసంచా పేల్చారు. దీంతో పక్కనే ఉన్న గుడిసెకు నిప్పంటుకొని దగ్ధమైంది.

ఈ నేపథ్యంలో మంటల వల్ల గుడిసెలోని సిలిండర్ పెళ్లి ఒకరు మృతి చెందగా మరో ఏడుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. పేలుడు ధాటికి పలువురి కాళ్లు, చేతులు తెగిపడ్డాయి. అక్కడే ఉన్న పోలీసులు, జర్నలిస్టులకు సైతం గాయాలయ్యాయి. దీంతో మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుంది. బాధిత కుటుంబాలు విషాదంలో మునిగిపోయాయి.

Read more RELATED
Recommended to you

Latest news