చైనా కు త్రిదళాధిపతి వార్నింగ్ : అల జరిగితే యుద్ధం తప్పదు

-

చైనాతో సరిహద్దులో ఉద్రిక్తతలు తగ్గించేందుకు జరుగుతోన్న చర్చలు ఎలాంటి ఫలితం ఇవ్వటం లేదు. ఈ క్రమంలో డ్రాగన్​కు గట్టి హెచ్చరికలు పంపారు త్రిదళాధిపతి (సీడీఎస్​) జనరల్​ బిపిన్​ రావత్​. ఇరు దేశాల మధ్య సైనిక, దౌత్య స్థాయి చర్చలు ఎలాంటి ఫలితాన్ని ఇవ్వకుంటే.. చైనా అతిక్రమణలను సైనిక చర్యలతోనే ఎదుర్కొంటామని స్పష్టం చేశారు. అందుకు తగిన విధంగా సన్నాహాలు జరుగుతున్నాయని తెలిపారు.

లద్ధాఖ్​ సెక్టార్​ నుంచి చైనా సైన్యాన్ని వెనక్కి పంపేందుకు భారత్​ ఎలాంటి సైనిక సన్నాహాలు చేస్తోందో అని వివరించేందుకు నిరాకరించారు రావత్​.ఇరు దేశాల మధ్య కుదిరిన ఒప్పందంతో కొన్ని ప్రాంతాల నుంచి సైన్యాన్ని వెనక్కి మళ్లించినా.. ఫింగర్​ ఏరియాల నుంచి ఉపసంహరించేందుకు నిరాకరిస్తోంది చైనా. సరిహద్దుల నుంచి సైన్యం ఉపసంహరణను ఆలస్యం చేసేందుకు జాప్యం చేస్తున్నట్లు కనిపిస్తోంది. అయినప్పటికీ.. ఉద్రిక్తతలను తగ్గించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. తాజాగా ఫింగర్​-4 ప్రాంతం నుంచి సమాన దూరంలో ఇరు దేశాలు బలగాలను ఉపసంహరించుకోవాలని చైనా చేసిన ప్రతిపాదనను భారత్​ తిరస్కరించింది.

Read more RELATED
Recommended to you

Latest news