నమ్రతను కూడా వదలని ట్రోలర్స్.. ట్విట్టర్ న్యూస్ వైరల్..!!

-

నమ్రత శిరోద్కర్.. తెలుగు సినీ ఇండస్ట్రీలోకి వంశీ సినిమాతో అడుగుపెట్టి ఆ తర్వాత మహేష్ బాబును ప్రేమించి మరీ వివాహం చేసుకుంది. నిజానికి వయసులో నాలుగు సంవత్సరాలు మహేష్ బాబు కంటే పెద్దది నమ్రత. ఇక వీరి వివాహానికి ఇంట్లో అంగీకరించకపోయినా..ముంబైలో రహస్యంగా వివాహం చేసుకున్న వీరి జంటను ఘట్టమనేని మంజుల తీసుకొచ్చి తండ్రిని ఒప్పించి మరీ వివాహం జరిపించింది. ఇక నమ్రత బాలీవుడ్ లో ఎన్నో సినిమాలలో నటించినప్పటికీ వివాహం తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్పిందని చెప్పవచ్చు. ఇక అప్పటి నుంచి ఇప్పటివరకు ఆమె ఏ రోజు కూడా సినిమాల వైపు ఆసక్తి కనబరిచింది లేదు. అంతేకాదు సోషల్ మీడియాకు కూడా దూరంగా ఉండే ఈమె ఇప్పుడు ఇప్పుడే తన కుటుంబానికి, పిల్లలకు సంబంధించిన ఫోటోలను, వీడియోలను షేర్ చేస్తూ మరింత పాపులర్ అవుతోంది.

విభేదాలకు దూరంగా ఉండే నమ్రత ఇటీవల ట్రోల్స్ కి గురవుతూ ఉండడం గమనార్హం. ఇకపోతే ఆగస్టు 9వ తేదీన మహేష్ బాబు పుట్టినరోజు కావడంతో ఆయన సినిమాకు సంబంధించిన అప్డేట్స్ ఏవి లేకపోయేసరికి తిరిగి ఆయన నటించిన పోకిరి సినిమాను 500 థియేటర్లలో మళ్ళీ వేసి కోట్లు సంపాదించారు నిర్మాతలు. ఇదిలా ఉండగా మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా బయట ఫ్లకార్డ్లు, బ్యానర్లు వేసి నానా హంగామా చేశారు.

అంతేకాదు ఇటీవల ఒక పోస్టర్లో మహేష్ బాబు – నమ్రత ఫోటోలతో పాటు పోకిరి సినిమాలోని మహేష్ బాబు డైలాగు .. ఎప్పుడొచ్చాం అన్నది కాదు అన్నయ్య బుల్లెట్ దిగిందా లేదా.. అని డైలాగులు కూడా బ్యానర్ పై వేయడం జరిగింది. ఇక ఇది చూసిన ఒక ఆకతాయి నెటిజన్.. నమ్రతాను ఉద్దేశించి.. మేడమ్ దిగిందా.. అని హాష్ ట్యాగ్ పెట్టి మరీ ట్రెండ్ చేయడం జరిగింది. ఇక ఇదే విషయం సోషల్ మీడియాలో ట్విట్టర్ వేదికగా వైరల్ అవుతూ ఉండడం గమనార్హం.. ఇక ఇలా నెటిజన్లు డబల్ మీనింగ్ పదాలతో సెలబ్రిటీలను ఇబ్బంది పెడుతున్నారని చెప్పవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news