గులాబీ భవన్లో సందడి వాతావరణం…

-

తెరాస అధినేత కేసీఆర్ వ్యూహాలకు గులాబీ నేతల సందడి తోడైతే ఇక వారికి అడ్డేముంది. ప్రభుత్వాన్ని రద్దు చేసిన రోజే చకాచకా అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్ నేడు బి –  ఫారాలు అందజేయనున్నారు. దీంతో ఆదివారం మధ్యాహ్నం నుంచి తెలంగాణ భవన్లో సందడి వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో బి-ఫారాలు అందుకోనున్న అభ్యర్థులు ఇప్పటికే తమ గుర్తింపు కార్డులు, కేసుల వివరాలతో సహా తెలంగాణ భవన్‌కు చేరుకొన్నారు. కొద్ది సేపటి క్రితమే భవన్ కి చేరుకున్న తెరాస అధినేత కేసీఆర్‌తొలుత తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేశారు. అనంతరం ఆయన అభ్యర్థులతో భేటీ  అయ్యారు.

ఈ సందర్భంగా ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై అభ్యర్థులకు దిశా నిర్దేశం చేస్తున్నారు. అదే విధంగా మహా కూటమిని ఎదుర్కొనేందుకు వారి బలాలను అంచనా వేస్తూ గెలుపే లక్ష్యంగా వారికి పలు సూచనలు చేస్తున్నారు. ఏఏ నియోజకవర్గాల్లో తాను ప్రచారంలో పాల్గొనే విషయాన్ని సైతం అభ్యర్థులకు నేడు వివరించనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news