డీకే అరుణ, జితేందర్‌ రెడ్డి ఇళ్లపై టీఆర్‌ఎస్‌ నేతల దాడి

-

మహబూబ్ నగర్ లోని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఇంటిపై టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు దాడి చేశారు. పదుల సంఖ్యలో డీకే అరుణ ఇంటికి చేరుకున్న టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు రాళ్లతో ఆమె ఇంటిపై దాడికి దిగారు. డీకే అరుణ ఇంటిలోని ఫర్నిచర్‌, కారు అద్దాలు ధ్వంసం అయినట్లు సమాచారం అందుతోంది.

ఇక అటు మాజీ ఎంపీ జితేందర్‌ రెడ్డి.. ఇంటి పై కూడా టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు దాడి చేశారు. ఈ నేపథ్యంలోనే.. పోలీసులు ఎంట్రీ ఇచ్చి.. టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులను అదుపులోకి తీసుకున్నారు. ఇక ఈ సంఘటనపై బీజేపీ పార్టీ నాయకులు.. టీఆర్ఎస్‌ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అన్యాయంగా తమ నాయకులపై హత్య ఆరోపణలు చేస్తున్నారని మండి పడుతున్నారు..

కాగా.. తెలంగాణ ఎక్సైజ్‌ శాఖ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ పై హత్య యత్నం చేసిన గ్యాంగ్‌ ను నిన్న పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. డీకే అరుణ, మాజీ ఎంపీ జితేందర్‌ రెడ్డి..ల హస్తం ఉందనే అనుమానాలు పోలీసులు కూడా వ్యక్తం చేస్తున్నారు. ఈ కేసులో ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

 

Read more RELATED
Recommended to you

Latest news