బీజేపీకి మరో షాక్‌ : ఎల్లుండి ఇందిరా పార్క్‌ వద్ద టీఆర్ఎస్ మహా ధర్నా

-

అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఎల్లుండి హైదరాబాద్‌ లోని ఇందిరా పార్క్‌ వద్ద మహా ధర్నా చేయాలని నిర్ణయం తీసుకుంది అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ. ఎల్లుండి అంటే 18 వ తేదీన ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌ మహా నగరంలో మహా ధర్నా చేసేందుకు ఆదేశాలు జారీ చేశారు టీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్ర శేఖర్‌ రావు.

kcr

ధాన్యం కొనుగోలు విషయం లో కేంద్ర ప్రభుత్వం తీరుకు నిరసన గా టీఆర్‌ఎస్‌ పార్టీ నిరసన చేయాలని నిర్ణయం తీసుకుంది. ఎల్లుండి జరుగ బోయే ఈ మహా ధర్నా కు టీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు అలాగే మంత్రులు పాల్గొననున్నారు. ఇవాళ టీఆర్‌ఎస్‌ భవన్‌ లో సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ ఈ నిర్ణయం తీసుకున్నారు. కాగా…. ఈ నెల 12 వ తేదీన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్‌ఎస్‌ పార్టీ ధర్నాలు చేసిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news