గురుకుల ప్రిన్సిపాల్‌ కాలర్‌ పట్టుకున్న టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే..వీడియో వైరల్‌

-

గద్వాల్ టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డి వివాదంలో చిక్కుకున్నారు. ప్రభుత్వ గురుకుల ప్రిన్సిపాల్‌పై బూతులు తిట్టుకుంటూ గద్వాల్ ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డి దాడి చేశారు. ఈ సంఘటన నిన్న జరుగగా, ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియా లో వైరల్‌ గా మారింది. అయితే.. గద్వాల్ టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డి తీరుపై ఆకునూరి మురళి.. స్పందించారు. వీళ్ళు మన MLA లు. గద్వాల్ ప్రాంతం లో గత 40 సo నుండి ఈ రెడ్డి దొరల అఘాయిత్యాలు దారుణమంటూ ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చట్టం తనపని తను చేస్తుందా?
onduty అధికారి మీద దౌర్జన్యం FIR చెయ్యండని డిజీపీని కోరారు ఆకునూరి మురళి.

Read more RELATED
Recommended to you

Latest news