సీఎం కేసీఆర్, కేటీఆర్, హరీష్ కంటే..నేనే ఎక్కువ చదివా – రసమయి సంచలన వ్యాఖ్యలు

-

సీఎం కేసీఆర్, కేటీఆర్, హరీష్ కంటే..నేనే ఎక్కువ చదివా అంటూ TRS ఎమ్మెల్యే రసమయి సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం తన సొంత నియోజకవర్గమైన… మానకొండూర్ లో ఓ దళిత మీటింగ్ లో టీఆర్ఎస్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

 

తాను పాటలు పాడి ఎమ్మెల్యే కాలేదని.. తాను డాక్టరేట్ చదవాను అంటూ పేర్కొన్నారు. రసమయి బాలకిషన్ అంటే మామూలు వ్యక్తి కాదని పేర్కొన్నారు. దళిత బిడ్డ అయిన నేను ఎన్నో ఉన్నత చదువులు చదివానంటూ రసమయి బాలకిషన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలోనే సీఎం కేసీఆర్, కేటీఆర్, హరీష్ కంటే..నేనే ఎక్కువ చదివా అంటూ TRS ఎమ్మెల్యే రసమయి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం రసమయి చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

Read more RELATED
Recommended to you

Latest news