రేపే టీఆర్‌ఎస్‌ ప్లీనరీ సమావేశం.. హైదరాబాద్‌ లో ట్రాఫిక్‌ ఆంక్షలు

-

రేపు హైదరాబాదు మాదాపూర్ HICC లో టిఆర్ఎస్ పార్టీ ప్లీనరీ సమావేశం జరుగనుంది. టిఆర్ఎస్ పార్టీ ద్విదశాబ్ధి ఉత్సవాలు రేపు జరుగనున్నాయి. రేపు ఉదయం 10 గంటలకు ప్రారంభం కానుంది ప్లీనరి. 2018 లోమేడ్చల్ జిల్లా కొంపల్లిలో ప్లీనరి జరుగగా… ఈ సారి మాదాపూర్ HICC లో జరుగనుంది.
అయితే.. ఈ సారి ప్లీనరికి కేవలం 6 వేల మంది ప్రతినిధులు హాజరు కానున్నారు. అట్టహాసంగా భారీ స్దాయీలో ప్లీనరీ ఏర్పాట్లు చేస్తున్నారు.

వేదిక పై 3, వందల మందికి కూర్చునేలా ఏర్పాట్లు చేశారు. 29 రకాల వంటలతో భోజన ఏర్పాట్లు కూడా ఏర్పాటు చేశారు నేతలు. పోటో ఎగ్జిబిషన్, ప్రతినిధుల రిస్ట్రేషన్ కౌంటర్లు ఏర్పాటు చేశారు. ప్లీనరీ జరుగుతున్న చుట్టూ ప్రక్కలా పెద్ద ఎత్తున ప్లెక్సీలు, కౌటౌట్లు కూడా ఏర్పాటు చేశారు టీఆర్‌ఎస్‌ నాయకులు… సైబరాబాద్ కమీషనర్ స్టీఫెన్ రవీంద్ర నేతృత్వంలో పోలీసు బందోబస్తూ ఏర్పాట్లు చేశారు. ఇక ఈ ప్లీనరీ సమావేశం నేపథ్యంలో హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌, మాదాపూర్‌, పంజాగుట్ట, హై టెక్‌ సిటీ ఏరియాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు ఉండనున్నాయి.

 

Read more RELATED
Recommended to you

Latest news