రైతులకు గుడ్ న్యూస్… ఈ పంట వేస్తే ఎకరానికి రూ.26 వేలు ఇవ్వనున్న ప్రభుత్వం

-

తెలంగాణలో ఆయిల్ పామ్ సాగు ప్రోత్సహించాలని మంత్రి మండలి నిర్ణయించింది. రానున్న 2022–23 సంవత్సరానికి రాష్ట్రంలో 20 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేపట్టే దిశగా రైతులను చైతన్యపరిచి ప్రోత్సహించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ఆయిల్ పామ్ సాగుచేసే రైతులకు ఎకరానికి మొదటి సంవత్సరం రూ.26,000, రెండవ సంవత్సరం ఎకరానికి రూ.5,000, మూడవ సంవత్సరం ఎకరానికి రూ. 5,000 చొప్పున పంట పెట్టుబడి ప్రోత్సాహకం కింద సబ్సిడీగా అందచేయాలని నిర్ణయించింది. ఆయిల్ పామ్ సాగు కోసం అటవీ శాఖ, అటవీ అభివృద్ధి కార్పోరేషన్ తో పాటు పంచాయితీరాజ్ మరియు రూరల్ డెవలప్ మెంట్ శాఖల సహాయంతో ఆయిల్ పామ్ మొక్కల నర్సరీలను పెంచాలని కేబినెట్ సూచించింది.

ఆయిల్ పామ్ పంట విధానం గురించి మరింతగా తెలుసుకోవడానికి మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులతో కూడిన అధ్యయన బృందం, కోస్టారికా, మలేషియా, థాయ్ లాండ్, ఇండోనేషియా తదితర దేశాలలో పర్యటన చేపట్టాలని కేబినెట్ ఆదేశించింది. ఆయిల్ పామ్ ప్రాసెసింగ్ యూనిట్లకు, తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ ప్రెన్యూర్ అడ్వాన్స్మెంట్ (టిఎస్ఐడిఈఏ), తెలంగాణ స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ల (టిఎస్ఎఫ్‌పిజెడ్) నిబంధనల ప్రకారం అందించే ప్రోత్సాహకాలు అందచేయాలని అధికారులకు కేబినెట్ సూచించింది.

 

Read more RELATED
Recommended to you

Latest news