దసరా పండుగకు ఊరెళ్లేవారికి తెలంగాణ ఆర్టీసీ గుడ్‌న్యూస్

-

మరో 15 రోజుల్లో దసరా, బతుకమ్మ పండుగలు రాబోతున్నాయి. ఈ పండుగలు రాగానే… తెలంగాణ ప్రజలందరూ వారి వారి స్వగ్రామాలకు వెళ్లి.. పండుగలు జరుపుకుంటారు. ఈ నేపథ్యంలోనే.. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలంగాణ ఆర్టీసీ అదిరిపోయే శుభవార్త చెప్పింది. హైదరాబాద్‌ నుంచి స్వగ్రామాలకు వెళ్లే ప్రయాణికుల కోసం.. తెలంగాణ ఆర్టీసీ.. కీలక నిర్ణయం తీసుకుంది.

ఈ నెల 26 వ తేదీ నుంచి శరన్నవ రాత్రులు ప్రారంభం కానుండగా.. ప్రయాణీకుల రద్దీని దృస్టిలో పెట్టుకుని.. సుమారు 4 వేల బస్సుల వరకు నడిపేందుకు కసరత్తు చేస్తోంది. గత ఏడాది ఈ సమయంలో 3300 బస్సుల వరకు నడిపింది. ఇందుకు సంబంధించిన ప్రతి పాదనలను అనుమతి కోసం ఆర్టీసీ అధికారులు సీఎండీ కార్యాలయానికి పంపినట్లు సమాచారం అందుతోంది. ఈ నెల 24 నుంచి వచ్చే నెల 7 వరకు దసరా స్పెషల్‌ బస్సులను నడుపాలని ఆర్టీసీ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ప్రయాణికుల రద్దీ ఎక్కువైతే.. బస్సుల సంఖ్య పెంచేందుకు కూడా సిద్ధం అవుతోంది. ఆర్టీసీ.

Read more RELATED
Recommended to you

Latest news