తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త..

-

తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ పాలక మండలి మరో తీపి కబురు చెప్పింది. శ్రీనివాస మంగాపురం లో… రేపటి నుంచి తిరుమల శ్రీవారి లడ్డూ విక్రయాలను ప్రారంభించాలని… టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయం తీసుకుంది. మొదటిరోజు ప్రయోగాత్మకంగా మూడు వేల శ్రీవారి లడ్డూలను విక్రయించారు అని నిర్ణయం తీసుకుంది టిటిడి పాలకమండలి.

ఈ ప్రయోగం విజయవంతం అవుతే… ప్రతిరోజు శ్రీనివాసమంగాపురం లో లడ్డు విక్రయాలను కొనసాగించాలని కూడా టిటిడి పాలకమండలి ఓ నిర్ణయానికి వచ్చింది. శ్రీవారి భక్తుల నుంచి ఎప్పటి నుంచో ఈ డిమాండ్ ఉంది. అయితే వారి డిమాండ్ ను దృష్టిలో ఉంచుకున్న టీటీడీ పాలక మండలి.. ఇవాళ నిర్వహించిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుంది. టీటీడీ తీసుకున్న ఈ నిర్ణయంతో శ్రీవారి భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా గత 15 రోజుల నుంచి తిరుపతి లో కురుస్తున్న… భారీ వర్షాల కారణంగా శ్రీవారి భక్తులకు.. అనేక ఇబ్బందులు తలెత్తుతున్న సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news