టిటిడి పాల‌క‌మండ‌లి నిర్ణ‌యాలివే…

-

 TTD Trust Board Decision On pending dream
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలకమండలి మంగళవారం సమావేశమైంది. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల జీతాలు పెంపై నిర్ణయం తీసుకుంది. అలాగే చిత్తూరు జిల్లా నారాయణ వనంలో రూ. 2.5 కోట్లతో అవణాక్షమ్మ ఆలయంలో అభివృద్ధి పనులు చేపట్టేందుకు పాలక మండలి నిర్ణయం తీసుకుంది. ఇంకా…

– రూ. 3.77 కోట్లతో శ్రీవారి పుష్కరిణి చుట్టూ గ్రిల్స్ ఏర్పాటు
– రూ. 21.7 కోట్లతో ఆధునాతన బూందిపోటు నిర్మాణం
– రూ. 28 లక్షలతో గంగమ్మగుడి ఆలయం వద్ద ఆర్చ్‌ నిర్మాణం
– అవిలాల చెరువు అభివృద్ధికి రూ. 42.7 కోట్లు కేటాయింపు
– రూ. 4.19 కోట్లతో భువనేశ్వర్‌లో శ్రీవారి ఆలయ నిర్మాణం చేపట్టేందుకు పాలకమండలి నిర్ణయం తీసుకుంది.

Read more RELATED
Recommended to you

Latest news