రైతుల నిరసనపై ట్వీట్ చేసిన రిహన్నా పోస్టులకి లైక్ కొట్టిన సీఈవో..

-

పాప్ సింగర్ రిహన్నా భారతీయ రైతులు చేస్తున్న నిరసన కార్యక్రమానికి మద్దతు తెలుపుతూ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. వ్యవసాయ చట్టాలని వెనక్కి తీసుకోవాలని రైతులు చేస్తున్న నిరసనలకి మద్దతుగా ట్విట్టర్ లో పోస్ట్ పెట్టింది. ఈ విషయమై ఇండియాలో రిహానాపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మా దేశంలోని అంతర కార్యకలాపాల్లో జోక్యం చేసుకోవడం సరైనది కాదని చాలా మంది అంటున్నారు. ఐతే ఈ ట్వీట్లకి ట్విట్టర్ సీఈవో లైక్ కొట్టడం ఆసక్తిగా మారింది.

రిహన్నా చేసిన ట్వీట్లకి వాషింగ్ట పోస్ట్ జర్నలిస్ట్ కరేన్ స్పందిస్తూ, రిహన్నా ఇలా చేయడం కొత్తేమీ కాదు. అమెరికాలో జార్జ్ ఫ్లాయిడ్ హత్యపై తన వాయిస్ వినిపించింది. ఇప్పుడు ఇండియాలో రైతులు జరుపుతున్న రైతుల నిరసనపై వాయిస్ వినిపించిందని ట్విట్టర్ లో పోస్ట్ పెట్టింది. కరేన్ చేసిన పోస్టుకి కూడా ట్విట్టర్ సీఈవో జాక్ డోర్సీ లైక్ కొట్టారు. ఇండియాలో ఐతే ఈ ట్వీట్లపై అనేక విమర్శలు వస్తున్నాయి. బయట వ్యక్తులకి ఇండియాలో జరుగున్న అంతర వ్యవహారాల్లో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని కామెంట్లు వస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news