తెలుగు రాష్ట్రాల్లో నెత్తురోడిన రహదారులు.. ఎనిమిది మంది మృతి !

-

తెలుగు రాష్ట్రాల్లో రహదారులు నెత్తురోడాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి రెండు ప్రమాదాలు జరగగా మొత్తం ఏడుగురు మృతి చెందారు. ఏపీలో నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సంగం మండలం దువ్వూరు వద్ద కూలీలతో వెళ్తున్న ట్రాలీని.. పాల వ్యాను ఢీకొంది. ఈ ఘటనలో ఐదుగురు కూలీలు మృతి చెందారు. అలాగే మరో ఐదుగురు గాయాలైన వారిని ఆస్పత్రికి తరలించారు.

ఇది కాక హైదరాబాద్ ఓఆర్ఆర్ సమీపంలోని పెద్దఅంబర్‌పేట్ వద్ద ప్రమాదం జరిగింది. ఔటర్ రింగ్‌రోడ్ సమీపంలో లారీని వెనుక నుంచి కారు ఢీకొట్టిన ప్రమాదంలో అక్కడికక్కడే ముగ్గురు మృతి చెందారు. మరో పక్క మధ్యప్రదేశ్​ గ్వాలియర్ ​లో కూడా ఒక భారీ రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 13 మంది మృతిచెందారు. ముగ్గురుకి తీవ్రంగా గాయాలయ్యాయి. బస్సు-ఆటో ఢీ కొట్టడం వల్ల ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మొత్తం మీద ఈరోజు మూడు రోడ్ యాక్సిడెంట్ కేసులు వెలుగులోకి వచ్చాయి.

Read more RELATED
Recommended to you

Latest news