ఏపీ అసెంబ్లీలో రెండు కీలక బిల్లులు ఆమోదం

-

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు వాడి వేడిగా సాగుతున్నాయి. ఈ రోజు అసెంబ్లీ లో నాలుగో రోజు సమావేశాలు జరుగుతున్నాయి. ఇక ఈ రోజు అసెంబ్లీ లో రెండు కీలక బిల్లులకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. అందులో ఒకటి దిశ చట్టం బిల్లు కాగా మరొకటి ల్యాండ్ టైటిలింగ్ బిల్లు. భూముల పూర్తిస్థాయిలో రీ సర్వే చేస్తున్నామని మంత్రి ధర్మాన ప్రకటించారు.

ఈ రీ సర్వే వెయ్యి కోట్ల దాకా ఖర్చు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ భూముల రీ సర్వే చేపట్టడం ద్వారా కోర్టుల మీద చాలా మేరకు ఒత్తిడి తగ్గుతుందని ధర్మాన పేర్కొన్నారు.. అయితే ఈ సర్వే ఆపేయాలని ప్రతిపక్ష నేత అచ్చెన్నాయుడు కోరారు. ఎందుకంటే ల్యాండ్ ఫైటింగ్ బిల్లును కేంద్రం తిప్పి పంపింది అని ఆయన అన్నారు. అలా ఎందుకు పంపిందో చెప్పి అప్పుడు బిల్ పాస్ చేయాలని ఆయన కోరారు.    

Read more RELATED
Recommended to you

Latest news