ఏపీ, తెలంగాణలో రెండ్రోజులు భారీ వర్షాలు..!

-

ఏపీలో మ‌రో రెండు రోజుల పాటు భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉందని అమ‌రావతి వాతావ‌ర‌ణ శాఖ తెలిపింది. బంగాళ‌ఖాతంలో ఏర్ప‌డిన అల్ప‌డిన ప్ర‌భావంతో ఇవాళ‌, రేపు వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని వెల్లడించింది. తూర్పుగోదావ‌రి జిల్లా, ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా, క‌ర్నూలు, నెల్లూరు, అనంత‌పూర్, చిత్తూరు, క‌డ‌ప జిల్లాల‌లో భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని వెల్ల‌డించింది.

అంతే కాకుండా తెలంగాణ లోని హైద‌రాబాద్, నిర్మ‌ల్, నిజామాబాద్, మెద‌క్, సంగారెడ్డి, రంగారెడ్డి, మ‌హ‌బూబ్ న‌గ‌ర్, కామారెడ్డి, సిరిసిల్ల‌, మ‌హ‌బూబాబాద్ ల‌లో కూడా భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణశాఖ వెల్ల‌డించింది. ఇక గ‌త కొద్ది రోజులుగా తెలంగాణలోని కొద్ది ప్రాంతాలలో వ‌ర్షాలు కురుస్తున్నాయి. నిన్న కూడా తెలంగాణ‌, ఏపీలోని కొన్ని జిల్లాల‌లో చిరు జ‌ల్లులు కురిసాయి.

Read more RELATED
Recommended to you

Latest news