T 20 world cup : భారత్ తో మ్యాచ్ కు ముందే న్యూజిలాండ్ కు బిగ్ షాక్…!

-

టీ20 వరల్డ్ కప్ లో భాగంగా ఇవాళ ఇండియా మరియు న్యూజిలాండ్ జట్లు మ్యాచ్‌ జరుగనున్న సంగతి తెలిసిందే. చెరో మ్యాచ్ ఓడిపోయిన ఇండియా, న్యూజిలాండ్ జట్లు ఇవాళ అబుదాబీ వేదికగా తలపడనున్నాయి. అలు ఆడిన 3 మ్యాచుల్లో గెలిచి గ్రూప్ టాపర్ గా పాకిస్తాన్ నిలిచింది. ఇక ఇవాళ గెలిచిన టీం కు సెమీస్‌ ఛాన్స్‌ ఉండనుంది.

ఇలాంటి తరుణంలో న్యూజిలాండ్ జట్టు కు ఊహించని షాక్‌ తగిలింది. న్యూజిలాండ్ టీం లో ఇవాళ్టి మ్యాచ్ కు ఇద్దరు స్టార్ ప్లేయర్లు దూరం కానున్నారు. గాయం కారణంగా పేసర్ లుకీ ఫెర్గుసన్, ఓపెనర్ మార్టిన్ గుప్తిల్ మ్యాచ్ కి దూరం కానున్నారు.

దీంతో గుప్తిల్ స్థానంలో టిమ్ సీఫెర్ట్ ఇవాళ జట్టులోకి రానున్నారు. అలాగే… టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు ఫెర్గుసన్. దీంతో ఫెర్గుసన్ స్థానంలో డారిల్ మిచెల్ జట్టులోకి రానున్నారు. స్టార్‌ ప్లేయర్లు దూరం కావడంతో… న్యూజిలాండ్‌ ఒత్తిడిలోకి వెళ్లింది. దీనిని అనువుగా చేసుకుని టీమిండియా గెలవాల్సిన అవసరముంది. ఈ మ్యాచ్‌ లో ఎలాగైనా గెలుస్తామని కోహ్లీ చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news