నిరుద్యోగి ఆత్మహత్య…నోటిఫికేషన్లు ఇవ్వాలంటూ సీఎం కేసీఆర్ కు లేఖ

-

తెలంగాణ లో మరో విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. గత కొంత కాలంగా ప్రభుత్వం నుంచి నోటిఫికేషన్లు లేకపోవడంతో మనస్తాపం చెందినట్లు తెలుస్తోంది. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం బబ్బెరు చెలక గ్రామానికి చెందిన అసంపల్లి మహేష్ అనే నిరుద్యోగి ఆదివారం ఆత్మహత్య చేసుకున్నాడు. టీచర్ ట్రైనింగ్ పూర్తి చేసిన మహేష్ కు ఉద్యోగం లేదు. గత కొంత కాలంలో ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నాడు. ఈ దశలోనే ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఎదరుచూస్తున్నారు. గత కొంతకాలంలో నోటిఫికేషన్లు లేకపోవడంతో మనస్తాపానికి గురై పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆత్మహత్య సమయంలో సూసైడ్ నోట్ రాశాడు. నోటిఫికేషన్లు విడుదల చేయాలంటూ కోరుతూ సీఎం కేసీఆర్ కు లేఖ రాశారు.

గతంలో కూడా తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో నిరుద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఏళ్లకేళ్లుచదువుతున్నా… నోటిఫికేషన్లు రాకపోవడంతో యువత నిరాశలో ఉంది. దీంతో నిరుద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. గతంలో పలువురి ఆత్మహత్యలు రాజకీయంగా చర్చనీయాంశం అయ్యాయి. ఈ ఘటన కారణంగా ప్రతిపక్షాలు అధికార టీఆర్ఎస్ పార్టీని టార్గెట్ గా చేసుకుంటూ విమర్శలు గుప్పించాయి.

 

Read more RELATED
Recommended to you

Latest news