ముంబై ఉద్ధవ్ ఠాక్రే ఇంటికి చేరుకున్న సీఎం కేసీఆర్.. ఏయిర్ పోర్ట్ లో ప్రకాష్ రాజ్ స్వాగతం

-

తెలంగాణ సీఎం కేసీఆర్ ముంబై చేరుకున్నారు. అక్కడి నుంచి నేరుగా మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే నివాసానికి చేరుకున్నారు. అంతకుముందు నటుడు ప్రకాష్ రాజ్ సీఎం కేసీఆర్ కు ఎయిర్ పోర్ట్ లో ఘన స్వాగతం పలికారు. లంచ్ మీటింగ్ లో ఉద్దవ్ ఠాక్రేతో సీఎం కేసీఆర్ భేటీ కానున్నారు. జాతీయ రాజకీయాలపై ప్రత్యేకంగా చర్చించనున్నారు. తాజాగా ఉద్ధవ్ ఠాక్రేతో సీఎ కేసీఆర్ భేటీ జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశం అయింది.

ముఖ్యంగా బీజేపీకి వ్యతిరేఖంగా… కూటమి పెట్టే ప్రయత్నాల్లో సీఎం కేసీఆర్ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రాంతీయ పార్టీలను ఏకతాటి పైకి తీసుకురావడానికీి సీఎం కేసీఆర్ ప్రయత్నాలు ప్రారంభించారు. అయితే ఇప్పటికే తమిళనాడు సీఎం స్టాలిన్, కేరళ సీఎం పినరయి విజయన్ ని కూడా కేసీఆర్ కలిశారు. . వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని అధికారంలోకి రాకుండా అడ్డుకునేందుకు కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా ఎన్డీయేతర పార్టీల సీఎంల సమావేశంపై కూడా ఉద్ధవ్ ఠాక్రే, కేసీఆర్ మధ్య చర్చకు వచ్చే అవకాశం ఉంది. 

సీఎంతో పాటు ఎంపీలు కేశవరావు, రంజిత్ రెడ్డిలతో పాటు ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్ రావు, కవితలు పాల్గొనగా..  సీఎం ఉద్ధవ్ ఠాక్రేతో పాటు శివసేన ముఖ్యనేత ఎంపీ సంజయ్ రౌత్ కూడా ఈ సమావేశంలో పాల్గొనున్నారు. ఉద్దవ్ ఠాక్రేతో మీటింగ్ తరువాత ఎన్సీపీ నేత శరద్ పవార్ తో మీటింగ్ కానున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news