అసలు కరోనా ఉందని తెలియని దంపతులు, అసలు కథ ఏంటీ…?

-

కరోనా వైరస్ ప్రపంచానికి చుక్కలు చూపిస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు అందరూ కూడా ప్రాణాలతో భయపడుతున్నారు. ఎవరి నోట విన్నా సరే ఇప్పుడు కరోనా మినహా మరో మాట లేదు, కరోనా దెబ్బకు మానవత్వం కూడా చచ్చిపోయింది. అలాటి కరోనా గురించి తెలియని వారు ఎవరు అయినా ఉన్నారా…? ఈ భూమి మీద దాని గురించి అందరికి ఐడియా అనేది ఉంది.

కాని ఇద్దరు భార్యా భర్తలకు మాత్రం అదొకటి వచ్చింది, ప్రపంచాన్ని నాశనం చేస్తుంది అనే విషయం తెలియదు. స్వేచ్చగా సముద్రంలో రోజుల తరబడి ఎంజాయ్ చేస్తున్నారు. ఇదేంటి అంటారా…? డబ్బులు ఎక్కువైన పనే ఇది. 2017లో తమ ఉద్యోగాలకి యూకేలోని మాంచెస్టర్‌కి చెందిర ఎలెనా మణిశెట్టి, ర్యాన్ ఒస్బోర్న్ అనే దంపతులు రాజీనామా చేసారు. ఆ తర్వాత ఒక బోటు కొనుక్కున్నారు.

కావాల్సినంత ఆస్తి ఉంది ఆ ఇద్దరికీ. దీనితో అన్నీ మర్చిపోయి ప్రపంచ వ్యాప్తంగా పర్యటించాలి సముద్రాలలో అనుకున్నారు. దీనితో అన్నీ పక్కన పెట్టి… వాళ్ళు సముద్రంలో విహరించడం మొదలుపెట్టారు. అప్పుడప్పుడు తమ ఇంట్లో వాళ్ళతో టచ్ లో ఉండాలని భావించారు. కాని నెగటివ్ విషయం ఏదీ కూడా తమకు చెప్పవద్దు అని కోరారు వాళ్ళు. దీనితో కరోనా గురించి వాళ్లకు ఎవరూ కూడా చెప్పలేదు.

అయితే… ఇటీవల తమ బోటు లో కరేబియన్ దీవుల దగ్గరకు వెళ్ళగా కరోనా కారణంగా సరిహద్దులను మూసి వేసారని చెప్పారు. మరి ఏం చెయ్యాలి…? వెంటనే ఇద్దరూ ఇటలీ సమీపం వైపుకి తమ పడవ తో బయల్దేరి వెళ్ళారు. గ్రెనడా కు వెళ్ళగా ఇంటర్నెట్ కనెక్షన్ వచ్చి తమ సన్నిహితుడి ద్వారా ఆశ్రయం పొందాలి అని చూసినా సరే అది సాధ్యం కాలేదు. ఇక వారిని ఐసోలేషన్ లో ఉండాలని అధికారులు సూచించారు. సముద్రంలోనే ఐసోలేషన్ లో ఉండిపోయారు.

Read more RELATED
Recommended to you

Latest news