Big News : ర‌ష్యాను చావుదెబ్బ తీసింది ఉక్రెయిన్‌..

-

ర‌ష్యాను చావుదెబ్బ తీసింది ఉక్రెయిన్‌. తాజాగా ఉక్రెయిన్ జ‌రిపిన మిస్సైల్ దాడిలో సుమారు 400 మంది ర‌ష్యా సైనికులు చ‌నిపోయిన‌ట్లు తెలుస్తోంది. ర‌ష్యా ఆక్ర‌మిత డోన‌స్కీ ప్రాంతంలో ఆ క్షిప‌ణి దాడి జ‌రిగింది. మ‌కీవ్‌కా న‌గ‌రంలో ఉన్న ఓ బిల్డింగ్‌ను మిస్సైల్ టార్గెట్ చేసింది. ఆ బిల్డింగ్‌లో ర‌ష్యా ద‌ళాలు ఉంటున్న‌ట్లు భావిస్తున్నారు. నిజానికి ఆ అటాక్‌లో ఎంత మంది ప్రాణాలు కోల్పోయారో స్ప‌ష్టంగా తెలియ‌దు. కానీ ర‌ష్యన్‌ అధికారులు ఆ దాడిని ద్రువీక‌రించిన‌ట్లు తెలుస్తోంది. రెండు రోజుల క్రితం ఉక్రెయిన్‌పై ర‌ష్యా మిస్సైళ్లు, డ్రోన్ల‌తో దాడి చేసిన విష‌యం తెలిసిందే. న్యూ ఇయ‌ర్ అర్థ‌రాత్రి మ‌కీవ్‌కా న‌గ‌రంపై దాడి జ‌రిన‌ట్లు ర‌ష్యా అధికారి డానిల్ బెజ‌నోవ్ తెలిపారు.

డొనెట్స్క్ 2014 నుంచి రష్యన్-మద్దతు గల వేర్పాటువాదుల ఆధీనంలో ఉంది. అంతర్జాతీయ చట్టాన్ని ఉల్లంఘిస్తూ అక్టోబర్‌లో మాస్కోను స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నించిన నాలుగు ఉక్రేనియన్ ప్రాంతాలలో ఇది ఒకటి. న్యూ ఇయ‌ర్ అర్థరాత్రి మ‌కీవ్‌కా న‌గ‌రంపై దాడి జ‌రిన‌ట్లు ర‌ష్యా అధికారి డానిల్ బెజ‌నోవ్ తెలిపారు. గ‌త ఏడాది ఫిబ్రవ‌రిలో యుద్ధం మొద‌లైన నాటి నుంచి డోన‌స్కీ ప్రాంతంలో ఉన్న ర‌ష్యా ద‌ళాల్ని ఉక్రెయిన్ టార్గెట్ చేస్తూనే ఉంది. అక్కడ ఉన్న న‌గ‌రాల‌పై దాడులు కొన‌సాగిస్తోంది. గ‌తేడాది ఆ ప్రాంతంలో సుమారు వెయ్యి మంది సాధార‌ణ పౌరులు మ‌ర‌ణించిన‌ట్లు ర‌ష్యా అధికారులు చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news