భారత్‌పై దాడికి భారీ కుట్రకు తెరలేపిన ఐసిస్..!

-

కరోనా‌ను అవకాశంగా ఉపయోగించుకుని భారత్‌పై దాడిచేయాలని ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ భారతీయ ముస్లింలకు పిలుపునిచ్చింది. ఈ మేరకు తన ఆన్‌లైన్ మ్యాగజైన్ ‘వాయిస్ ఆఫ్ హింద్’లో పేర్కొంది. దీని కవర్ పేజీపై ఢిల్లీలోని మర్కజ్ కార్యక్రమానికి హాజరైన వారి ఫొటోతో పాటు ఢిల్లీ అలర్ల ఫొటోలను ముద్రించింది. అల్లాను నమ్మని వారిని హతమార్చాలంటూ ఓ పదిహేడు పేజీల కథనాన్ని భారత్‌కు వ్యతిరేకంగా ప్రచురించినట్లు తెలుస్తోంది.

ఐసిస్ సభ్యులు కేరళ, కర్ణాటకలో పెద్ద సంఖ్యలో తిష్ఠ వేశారని పేర్కొంది. భారత్‌, పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌, మయన్మార్‌లో ఎక్యూఐఎస్ సభ్యులు 150-200 మంది ఉండొచ్చని తెలిపింది. ఈ ప్రాంతంలో దాడులకు కుట్రలు పన్నుతున్నారని హెచ్చరించింది. అలాగే ఐసిస్‌కు చెందిన భారత అనుబంధ ముఠా (హింద్‌ విలాయాహ్‌)లో 180 నుంచి 200 మంది సభ్యులు ఉన్నారు. భారత్‌లో కొత్తగా ఒక ‘ప్రావిన్స్‌’ను ఏర్పాటు చేసినట్లు గత ఏడాది మేలో ఐసిస్‌ పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Latest news