అనుకోని అతిధులే మన జీవితంలోకి వస్తారు – రేణు దేశాయ్ పోస్ట్ వైరల్..!

-

ఒకప్పటి ప్రముఖ హీరోయిన్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు . ఇక ఈమె సినిమాలలో నటించకపోయిన సరే సోషల్ మీడియా ద్వారా ఎప్పుడు అభిమానులకు చేరువలోనే ఉంటుంది. నిత్యం ఏదో ఒక ఫోటోని షేర్ చేస్తూ తన భావాలను వ్యక్తపరుస్తూ ఉండే రేణుదేశాయ్ ఈ మధ్యకాలంలో తన పిల్లల ఫోటోలు , వీడియోలను కూడా షేర్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు తాజాగా ఒక పోస్ట్ చేసి మరొకసారి వార్తల్లో నిలిచింది ఈ ముద్దుగుమ్మ.

వాస్తవానికి రేణు దేశాయ్ ఒక మల్టీ టాలెంటెడ్ వుమెన్ అని చెప్పవచ్చు. ఎందుకంటే మోడల్ గా కాస్టింగ్ డిజైనర్ గా , యాక్టర్ గా, డైరెక్టర్ గా కూడా తన సత్తా చాటింది. బద్రి, జానీ వంటి తెలుగు సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన పవన్ కళ్యాణ్ ను పెళ్లి చేసుకొని ఇద్దరు పిల్లలు పుట్టాక 2012లో విడాకులు తీసుకుంది. ఇక ఆ తర్వాత పిల్లలతో కలిసి ముంబైలో జీవిస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఇకపోతే తాజాగా ఇన్ స్టా గ్రామ్ ద్వారా ఒక వీడియోని షేర్ చేస్తూ.. “మండుటెండలో చల్లని వసంత గాలిలా కొంతమంది మన జీవితంలోకి అనుకోకుండా వస్తారు. వారి చూపులతోనే నేరుగా మన మనసుతో మాట్లాడుతారు.. అదొక మూగ భాష..

మనం వారితో కొన్ని గంటలు గడిపినప్పటికీ వారి ప్రభావం మనపై శాశ్వతంగా ఉంటుంది. కానీ వాటిలో చాలావరకు బాధాకరమైనవి కూడా ఉంటాయి. కానీ కొందరు మాత్రమే మన జీవితాన్ని పరిపూర్ణం చేసి.. మన కన్నీళ్లను తుడిచి.. కాంతిని పంచుతారు.. మనల్ని నవ్విస్తారు” అంటూ మనసులోని భావాలను అక్షర రూపంలో వీడియో ద్వారా పోస్ట్ చేసింది రేణు దేశాయ్.ఇక ఈ వీడియో కాస్త ఇప్పుడు చాలా వైరల్ గా మారుతుంది.

 

View this post on Instagram

 

A post shared by renu desai (@renuudesai)

Read more RELATED
Recommended to you

Latest news