కేసీఆర్ పథకాలపై కేంద్రం ప్రశంసలు..!

-

కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ఇవాళ వివిధ రాష్ట్రాల సీఎంలు, వ్యవసాయ శాఖ మంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న రైతుబంధు పథకాన్ని, రైతు సమన్వయ సమితిల ఏర్పాటును కేంద్ర ప్రభుత్వం అభినందించింది. రాష్ట్రంలో రైతుబంధు సహా వ్యవసాయాభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్నారని కేంద్ర వ్యవసాయ శాఖ ప్రశంసించింది. అలాగే రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఫార్మర్ నెట్ వర్క్ విస్తరించిందని ఆయన వివరించారు.

ఈ నెట్ వర్క్ ద్వారా అగ్రికల్చర్ ఇన్ఫ్రా స్ట్రక్షర్ ఫండ్ స్కీమ్ లాంటివి సమర్థవంతంగా అమలు చేయడం సాధ్యమవుతుందని కేంద్ర వ్యవసాయ శాఖ అధికారిక ప్రజంటేషన్ లో ప్రస్తావించారు. కాగా, ఈ సమావేశానికి తెలంగాణ తరుఫున వ్యవసాయ శాఖ మంత్రి ఎస్. నిరంజన్ రెడ్డి పాల్గొన్నారు. రాష్ట్రంలో వ్యవసాయ రంగాభివృద్ధి కోసం, రైతుల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ నాయకత్వంలో ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తుందని ఈ సందర్భంగా నిరంజన్ రెడ్డి అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news