నెహ్రూ డ్రగ్స్ తీసుకునేవారు.. కేంద్రమంత్రి కౌశల్ కిషోర్ వివాదాస్పద వ్యాఖ్యలు

-

కేంద్ర మంత్రి కౌశల్ కిషోర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ డ్రగ్స్ తీసుకునే వారని, సిగిరెట్ తాగేవారని సంచలన వ్యాఖ్యలు చేశారు. మహాత్మా గాంధీ కుమారుడు కూడా డ్రగ్స్ తీసుకునే వారిని చెప్పారు. కౌశల్ కిషోర్ చేసిన ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్, ప్రతిపక్ష నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఆయన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

అయితే కౌశల్ కిషోర్ చాలా కాలంగా డ్రగ్స్ కి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు. డ్రగ్స్ కారణంగానే తన కుమారుడిని కోల్పోయానని ఇటీవల వెల్లడించారు కౌశల్ కిషోర్. తాజాగా నషాముక్తి జాగరణ్ అభియాన్ లో పాల్గొనేందుకు రాజస్థాన్లోని భరత్పూర్ కు వచ్చిన కేంద్ర మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news