ఇది అవమానించడమే.. తెలంగాణ సర్కార్‌పై కిషన్‌రెడ్డి ఫైర్‌..

-

ఈ నెల 14న నల్గొండలోని నాగార్జున సాగర్ లో నిర్మించిన బుద్ధవనం ప్రాజెక్టును ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు. అయితే.. ఈ క్రమంలో కేంద్ర టూరిజం మంత్రి కిషన్ రెడ్డి ట్వీట్ చేశారు. బుద్ధవనం ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం రూ. 22.24 కోట్లు కేటాయించిందని, ఈ కార్యక్రమానికి తనకు ఆహ్వానం అందలేదని తెలిపారు. కేంద్ర టూరిజం మంత్రినైన తనను పిలవకుండా రాష్ట్ర ప్రభుత్వం అవమానించదన్నారు కిషన్‌రెడ్డి. ఇకపోతే… రాష్ట్రంలో టీఆర్ఎస్, బీజేపీ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది.

Cabinet Reshuffle: G Kishan Reddy

ఈ నేపథ్యంలో.. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పర్యటనతో టీఆర్ఎస్, బీజేపీ నాయకుల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఇటు సోషల్‌ మీడియాలో, అటు మీడియా ముందు నిత్యం ఇరుపార్టీల నాయకులు ఒకరిపైనొకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. తనను అవమానించారని ఆరోపిస్తూ మంత్రి కేటీఆర్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కు లీగల్ నోటీసులు జారీ చేశారు. ఇక రేపు కేంద్ర మంత్రి అమిత్ షా ముచ్చింతల్ కు రానున్న నేపథ్యంలో మంత్రి కిషన్ రెడ్డి పెట్టిన తాజా ట్వీట్ ప్రాధాన్యం సంతరించుకుంది.

Read more RELATED
Recommended to you

Latest news