ఏపీకి కేంద్రం గుడ్ న్యూస్…నేడు 5 ఫ్లై ఓవర్లకు శంఖుస్థాపన

-

ఏపీ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఇవాళ రాజమండ్రిలో కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా 216 జాతీయ రహదారిపై ఐదు ఫ్లై ఓవర్లకు శంఖుస్థాపన చేయనున్నారు కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ. రాజమండ్రి మోరంపూడి, జొన్నాడ జంక్షన్, ఉండ్రాజవరం జంక్షన్ , తేతలి, కైకరం వద్ద నాలుగు లేన్ల ఫ్లైఓవర్ల నిర్మాణానికి ఆయన శంకు స్థాపనం చేయనున్నారు.

రాజమండ్రి ఆర్ట్స్ కళాశాల బహిరంగ సభ వద్ద మూడు వేల కోట్ల రూపాయల హైవే ప్రాజెక్టులకు శిలఫలకాలు ఉన్నాయి. ఇక ఇవాళ ఉదయం 11 గంటలకు రాజమండ్రి ఎయిర్ పోర్ట్ చేరుకోనున్న కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ… గడ్కరీతో పాటు పర్యటనలో మరో కేంద్ర మంత్రి కిసాన్ రెడ్డి పాల్గొననున్నారు. రాజమండ్రి ఎం.పి మార్గాని భరత్ , బి.జె.పి రాష్ట్ర అధ్యక్షుడు
సోము వీర్రాజు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news