అన్ స్టాపబుల్ సీజన్ 4 బాలయ్యతో మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి.. రచ్చ మామూలుగా లేదుగా..

-

నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా చేస్తున్న ‘అన్ స్టాపబుల్’ షో సీజన్ 2 గ్రాండ్ గా ప్రారంభమైన సంగతి తెలిసిందే.. మొదటి ఎపిసోడ్ కి మాజీ సీఎం చంద్రబాబు నాయుడు నారా లోకేష్ హాజరవ్వగా తర్వాత యువ హీరోలు విశ్వక్సేన్ సిద్దు జొన్నలగడ్డ అతిధులుగా విచ్చేశారు అయితే ప్రస్తుతం తెలుగు ప్రజలందరికీ సర్ప్రైజ్ ఇస్తూ ఎపిసోడ్ 4 మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ని ఆహ్వానించారు బాలకృష్ణ ఈ ఎపిసోడ్లో వీరిద్దరూ చేసిన అల్లరి చూసిన ప్రేక్షకులు కిరణ్ కుమార్ లో ఈ యాంగిల్ ని చూసి షాక్ అవుతున్నారు..

 

ఆంధ్రప్రదేశ్ కు కొన్నాళ్లపాటు సీఎంగా వ్యవహరించిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బాలకృష్ణకు స్నేహితుడు వీరిద్దరూ నిజం కాలేజీలో కాలేజ్ చదువుకున్నారు రాజకీయాలు సినీ రంగంతో సంబంధం లేకుండా వీరి స్నేహం ఇప్పటివరకు కొనసాగుతూనే వచ్చింది. అయితే తాజాగా బాలకృష్ణ అన్ స్టాపబుల్ కు కిరణ్ కుమార్ రెడ్డి రావడం బాలయ్య స్టేజ్ పైన అతనితో కలిసి చేసిన అల్లరి చూసిన ప్రేక్షకులు వీరిలో యాంగిల్ ను చూసి షాక్ అయిపోతున్నారు..

ఎప్పుడూ హుందాగా కనిపించే కిరణ్ కుమార్ రెడ్డి ఈ షోలో కొత్త యాంగిల్ చూపించారు. ఇక బాలయ్య ‘స్నేహమే నా జీవితం .. స్నేహమేరా శాశ్వతం అనే పాట పాడుతూ ఎంట్రీ ఇచ్చారు. ఇప్పటివరకు మీరంతా బాలకృష్ణ కుటుంబాన్ని చూశారు ఇప్పుడు బాలయ్య స్నేహాన్ని చూడండి అంటూ చెబుతుండగానే కిరణ్ కుమార్ రెడ్డి ఎంట్రీ ఇచ్చారు బాలయ్య అతనికి ఎదురెళ్లి చేయి పట్టుకొని స్వాగతం పలికారు.. వెంటనే ‘అధ్యక్షా నా మైక్ ఆపేశారు అధ్యక్షా’ అంటూ బాలయ్య అల్లరిగా కిరణ్ కుమార్ రెడ్డి ముందు డైలాగ్స్ కొట్టగా.. నేను స్పీకర్ అయ్యాక అర్థరాత్రి 12 గంటలకి ఫోన్ చేసి ఇదే మాట చెప్పారు బాలకృష్ణ అని అన్నారు.. ఈ షోలో వీరితోపాటు
మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి, రాధిక కూడా హాజరయ్యారు.. ఈ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డిని గుర్తు చేసుకున్న కిరణ్ కుమార్ రెడ్డి ఆయన గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనిషి అంటూ కొనియాడారు..

Read more RELATED
Recommended to you

Latest news