యూపీలో తొలి విడత ఎన్నికలు పూర్తి…58.77 శాతం పోలింగ్ నమోదు

-

యూపీలో తొలిదశ ఎన్నికలు ప్రశాంతం పూర్తయ్యాయి. 11 జిల్లాల్లోని 58 నియోజక వర్గాలకు ఎన్నికలు జరిగాయి. మొత్తం 623 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. అయితే తొలి విడతలో 57.79 శాతం పోలింగ్ నమోదైంది. మొత్తం ఏడు విడతల్లో యూపీ ఎన్నికలు జరుగనున్నాయి. దశల వారీగా మిగతా విడతల ఎన్నికలు నిర్వహించనుంది ఎన్నికల సంఘం.

ఇలా ఉంటే బీజేపీ అధికారం నిలబెట్టుకునేందుకు ఆరాటపడుతుండగా.. యోగీ సర్కార్ను గద్దె దించేందుకు సమాజ్ వాదీ పార్టీ అఖిలేష్ యాదవ్ ప్రయత్నిస్తున్నారు. కాంగ్రెస్ పోటీలో ఉన్నప్పటికీ.. బీజేపీ, ఎస్పీ మధ్యనే పోటీ ఉండనుంది. ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్ సాయంత్ర 6 గంటలకు ముగిసింది. ఓటేసేందుకు భారీగానే ఓటర్లు బారులు తీరారు.

Read more RELATED
Recommended to you

Latest news