పార్టీలకు అతీతంగా ఉత్తరాంధ్రను అభివృద్ధి చేయాలి – నాదెండ్ల మనోహర్

-

పార్టీలకు అతీతంగా ఉత్తరాంధ్ర అభివృద్ధికి కృషి చేయాలని అన్నారు జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్. ఉత్తరాంధ్ర వెనుకబాటుపై విశాఖలో మాజీ మంత్రి కొణతల రామకృష్ణ నిర్వహించిన చర్చలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాబోయే రోజుల్లో మంచి ప్రభుత్వం రాబోతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్రను అభివృద్ధి చేస్తేనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుందన్నారు నాదెండ్ల.

విశాఖలో ఐటీ అభివృద్ధిని ప్రభుత్వం గాలికి వదిలేసిందని ఆరోపించారు. ఐటీ పెట్టుబడి సదస్సులు పెట్టిన ఉపాధి కల్పించడం లేదన్నారు. ఉత్తరాంధ్రలో మైనింగ్ మాఫియా పెరిగిపోయిందని మండిపడ్డారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ డెవలప్మెంట్ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. గిరిజనుల కోసం అరకు డిక్లరేషన్ చేస్తామన్నారు. నిరుద్యోగులు కోచింగ్ కోసం దూర ప్రాంతాలకు వలస వెళుతున్నారని చెప్పారు. పార్టీలకు అతీతంగా ఉత్తరాంధ్రను అభివృద్ధి చేయాలని కోరారు నాదెండ్ల మనోహర్.

Read more RELATED
Recommended to you

Latest news