ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళకే చోటివ్వండి : సీనియర్ కాంగ్రెస్ నాయకుడు విహెచ్

-

తెలంగాణాలో రాజకీయ పరిస్థితుల గురించి మరోసారి కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వి హనుమంతరావు మాట్లాడారు. మాములుగా రాజకీయంలో ఎక్కువగా హావ ఏ పార్టీలో ఉంటే, ఆ పార్టీలో చేరడానికి అందరూ ఉత్సాహం చూపిస్తుంటారు. ఇప్పుడు తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగుతోందని ఈ సందర్భంగా హనుమంతరావు మాట్లాడారు. అందుకే ఇతర పార్టీలకు చెందిన చాలా మంది నేతలు కాంగ్రెస్ లోకి వచ్చి పార్టీ తీర్థాన్ని పుచ్చుకోవాలని ఆశిస్తున్నట్లు చెప్పారు. అయితే పార్టీ అభివృద్ధి పాదంలో ముందుకు దూసుకు వెళ్ళాలి అంటే కొత్త నాయకులు పార్టీలో చేరాలి అన్నారు. అయితే నిజంగా పార్టీ మీద అభిమానంతో వచ్చే వారిని మాత్రం పార్టీలోకి ఆహ్వానించాలి.

అంతే కానీ పార్టీలోనే ఉంటూ వినాశనానికి పధకాలు రచించే వారని కాదని రేవంత్ రెడ్డి మరియు అధిష్టానానికి సలహా ఇచ్చారు. ఇంకా పార్టీలోకి వస్తున్న వారు వెంటనే పదవులు ఆశించవద్దని నిక్కచ్చిగా చెప్పడం ఎవరినో ఉద్దేశించి అన్నది క్లియర్ గా అర్ధమవుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news